జడ్చర్ల పోలీసులు సమర్ధవంతంగా పనిచేసి, వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలు మరియు బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు:
1. రాసూరి హరికృష్ణ (26): ఏటీగడ్డపల్లి, అన్నమయ్య జిల్లా (ముఠా నాయకుడు, పాత నేరస్థుడు).2. షేక్ ఇసాక్ (22): మదనపల్లి, అన్నమయ్య జిల్లా,
3. మూడే లక్ష్మణ్ నాయక్ (33): మదనపల్లి, అన్నమయ్య జిల్లా.
కేసు వివరాలు:
నిందితులు ముగ్గురు ఆన్లైన్ గేమింగ్ (I, udo, పేకాట) కు అలవాటు పడి భారీగా అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చడానికి దొంగతనాల బాట పట్టారు.ఫిబ్రవరి 16: కర్నూలులో బైక్ దొంగిలించి, గోనెగండ్లలో ఒక మహిళ మెడలోని 2 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు.
ఫిబ్రవరి 25: ఇటిక్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో యూనికార్న్ టైక్ (TS33B3927) దొంగతనం చేశారు.
ఫిబ్రవరి 27: జడ్చర్ల కృష్ణారెడ్డి నగర్ కాలనీలో టైలర్ షాపులో ఉన్న మహిళను నీళ్ల బాటిల్ అడిగే నెపంతో నమ్మించి, ఆమె మెడలోని 2 తులాల బంగారు పుస్తెల తాడును బలవంతంగా లాక్కొని సారిపోయారు.
అరెస్ట్ అఫ్ ది గ్యాంగ్:
ఈ రోజు (మార్చి 03) సాయంత్రం జడ్బర్ల ఎస్సై కె. మల్లేష్ గారు మరియు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించారు.స్వాధీనం చేసుకున్నవి:
4 తులాల బంగారు ఆభరణాలు (రెండు తులాల గొలుసు + రెండు తులాల పుస్తెల తాడు)నేరానికి ఉపయోగించిన హోండా యూనికార్న్ టైక్,
ముగింపు:తక్కువ సమయంలో కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న ఎస్సై మల్లేష్ గారు మరియు వారి సిబ్బందిని పై అధికారులు అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
