రైతులకు ALERT.. నేటి నుంచి విత్తనాల పంపిణీ
TG: రైతులకు నాణ్యమైన విత్తనాలను సమకూర్చడమే లక్ష్యంగా నేటి నుంచి ఈ నెల 30 వరకు విత్తన వారోత్సవాలు జరగనున్నాయి. జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో అన్ని పంటలకు సంబంధించిన దాదాపు 1,231 టన్నుల సీడ్స్ను సరసమైన ధరలకు వ్యవసాయ అధికారులు పంపిణీ చేస్తారు. ఇందుకోసం జిల్లాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో సంప్రదించాలి.