అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో చమురు కంపెనీల దిగుమతి ఖర్చులు అధికమవుతున్నాయి. దీని ప్రభావం రవాణా, తయారీ, డెలివరీ సేవలపై పడుతోంది. ముఖ్యంగా డీజిల్ ధరల పెరుగుదలతో కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కొరియర్ సేవలు, క్యాబ్లు, బస్సు ఛార్జీలు, సిమెంట్, ఉక్కు, రసాయన ఉత్పత్తుల ధరలపైనా ప్రభావం పడనుంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.